
Harish Balayogi
618 subscribers
About Harish Balayogi
*Member of parliament,18th lok sabha*
Similar Channels
Swipe to see more
Posts

కొత్తపేట శాసన సభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజల సేవలో మీ నిబద్ధత, ప్రాంత అభివృద్ధిపై మీరు చూపుతున్న నిరంతర కృషి ప్రశంసనీయం. మీరు సుదీర్ఘాయుష్మంతుడిగా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, మరిన్ని విజయాలు సాధించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.

పి గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.భవిష్యత్తులో మరిన్ని సంతోషకరమైన పుట్టిన రోజులు జరుపుకోవాలని మనస్పూరిగా కోరుకుంటున్నాను.


అమలాపురం పార్లమెంట్ పరిధిలో అభివృద్ధికి సహకరించాలని, తీర ప్రాంతాల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించాలని రాజమండ్రిలోని ఓ ఎన్ జీ సీ కార్యాలయంలో అసెట్ మేనేజర్ శంతను దాస్ గారితో జరిగిన సమావేశంలో తెలియజేశాను. గ్రామాలలో మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు నిర్దిష్టమైన ప్రణాళికతో సి ఎస్ ఆర్ నిధులు వినియోగించాలని సూచించాను. యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు కృషి చేస్తున్న స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సహాయ సహకారాలు అందించి కోనసీమ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై దృష్టి సారించాలని తెలియజేయడం జరిగింది.


24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు జమ – కూటమి ప్రభుత్వం యొక్క సమర్థ పాలనకు ఇది ప్రతీక. విజయవాడలో పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ Nadendla Manohar గారితో జరిగిన భేటీలో, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని మరింత పెంచాల్సిన అవసరాన్ని నేను ప్రస్తావించాను. ఇప్పటికే 2.80 లక్షల మెట్రిక్ టన్నులుగా నిర్ధారించిన కొనుగోలు లక్ష్యాన్ని, రైతుల ఆర్థిక భద్రత కోసం మరో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ అవసరం ఉందని తెలియజేశాను. ఈ విషయంలో ఆయన సానుకూలంగా స్పందించారని తెలియజేయడం ఆనందంగా ఉంది. ప్రతి ధాన్యపు గింజను సైతం రైతుల నుండి మద్దతు ధరకు సేకరించాలనే లక్ష్యంతో కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం, కొనుగోలు జరిగిన 24 గంటలలోపే రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తూ పునాదిని బలపరుస్తోంది. ఇది ముఖ్యమంత్రి శ్రీ Nara Chandrababu Naidu గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు రైతుల పట్ల చూపుతున్న చిత్తశుద్ధికి, తక్షణ ఆర్థిక లాభాలు కల్పించే పాలనాకౌశల్యానికి నిదర్శనం.


ఈరోజు విజయవాడలో దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ రీజినల్ మేనేజర్ మరియు డిప్యూటీ చీఫ్ ఇంజనీర్లతో సమావేశంలో పాల్గొన్నాము. కోటిపల్లి-నర్సాపూర్ రైల్వే లైన్ భూసేకరణ సంబంధిత అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. భూసేకరణ ప్రక్రియలో ఎదురైన లోటుపాట్లు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇంకా చెల్లించాల్సిన నష్టపరిహారాల అంశాలు ఈ సందర్భంగా ప్రస్తావించాము. రైతులకు న్యాయం జరగాలి అనే దృక్కోణంతో, వారికి తగిన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టంగా సూచించాము. భూసేకరణ అవార్డుల జారీ, పరిహారం చెల్లింపు, క్లియరెన్స్ ప్రక్రియల వేగవంతం గురించి కేంద్రీయ స్థాయిలో ఇప్పటికే కొనసాగుతున్న చర్చల్లో భాగంగా, ఈ సమావేశం కొనసాగింపుగా జరిగింది. అలాగే, మండపేట మండలంలోని ద్వారపూడి రైల్వే స్టేషన్లో కనీస సౌకర్యాల లేకపోవడంపై ప్రయాణికుల నుండి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, స్థానిక శాసన సభ్యులు శ్రీ వేగుళ్ల జోగేశ్వరరావు గారితో కలిసి ఇటీవల స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించామన్న విషయాన్ని ఈ సందర్భంగా అధికారులకు తెలియజేశాము. అక్కడ గుర్తించిన లోపాల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయగా, పరిస్థితులను సమీక్షించేందుకు ప్రత
