
Harish Balayogi
June 2, 2025 at 05:40 AM
గౌరవనీయ డా. శశి థరూర్ గారి నేతృత్వంలోని అఖిల పక్ష పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో భాగంగా బ్రెజిల్ పర్యటనలో పాల్గొనడం గర్వకారణం.
ఈ పర్యటనలో పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి వివరిస్తూ, ఉగ్రవాదంపై భారతదేశం అనుసరిస్తున్న అసహనపూరిత ధోరణిని బ్రెజిల్ నాయకత్వానికి స్పష్టంగా తెలియజేశాము.మానవత్వానికి విరుద్ధమైన వాదన మీద సంభాషణకు స్థానం లేదని, వ్యాపారం మరియు రక్తపాతం ఒకే వేదికపై కలిసి నడవలేవన్న వాస్తవాన్ని ఈ సందర్భంగా మరోసారి ఉద్ఘాటించాము.
బ్రెజిల్ పార్లమెంటరీ నాయకులతో జరిగిన చర్చలు, స్థానిక భారతీయ సముదాయంతో మమేకమై, ద్వైపాక్షిక సంబంధాల విస్తరణ వంటి అంశాలు ఈ పర్యటనను గాఢమైన దౌత్య విజ్ఞానం మరియు అర్థవంతమైన సందేశంతో నింపాయి.
భారతదేశం యొక్క స్థిరమైన ధైర్యం, ఉగ్రవాదంపై అసహన వైఖరికి ఈ పర్యటన మరోక దేశపు మద్దతు కూడగట్టినట్లైంది. #operationsindhoor

👍
1