
𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗
June 13, 2025 at 04:15 AM
*నేటి వార్తల ముఖ్యాంశాలు*
▪️అమరావతిలో దావోస్ సెంటర్.. పెట్టుబడుల ఆకర్షణకు దేశంలోనే తొలిసారి ఏర్పాటు. మంత్రి లోకేష్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు.
▪️గ్రామ సచివాలయ ఉద్యోగులు ఒకచోట 5 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి సొంత మండలంలో పోస్టింగ్ లేదు. బదిలీల మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం.
▪️ తల్లికి వందనం పథకంపై ప్రకటన చేసిన ప్రభుత్వం. 67 లక్షల మందికి 10,091 కోట్లు ఇస్తున్నట్టు వెల్లడి.
▪️ జూలై 15 నుండి లెక్చరర్ పోస్టులకు రాత పరీక్షలు. షెడ్యూల్ ప్రకటించిన ఏపీపీఎస్సీ.
▪️ 80% రాయితీతో రైతులకు ఎరువుల పిచికారికి డ్రోన్లు పంపిణీ చేయనున్న ప్రభుత్వం. 875 యూనిట్లు మంజూరు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నరు.
▪️ పదవ తరగతి సప్లమెంటరీ ఫలితాలలో 76% ఉత్తీర్ణత. ఈనెల 13 నుండి 19 వరకు రీకౌంటింగ్ రీ వెరిఫికేషన్ కు అవకాశం.
▪️ ఈనెల 21న విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో 40 దేశాల నుండి ప్రతినిధులు వస్తున్నట్లు కేంద్రమంత్రి ప్రతాప్ రావు జాదవ్ వెల్లడి.
▪️అహ్మదాబాద్ లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం. 265 మంది మృతి.
https://whatsapp.com/channel/0029VanGolYJ3jv4E4HpnC10