
𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗
June 14, 2025 at 02:54 AM
*నేటి వార్తల ముఖ్యాంశాలు*
▪️నేడు నీట్ యుజి ఫలితాలు విడుదలయ్యే అవకాశం.
▪️ఈనెల 19న జరగవలసిన క్యాబినెట్ భేటీ 24 కు వాయిదా.
▪️ఏడాది పాలనపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం. జూలైలో పార్టీ నేతలు, కార్యకర్తలకు నాయకత్వ శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడి.
▪️ఈనెల 23 నుంచి నెలరోజులు సుపరిపాలన - తొలి అడుగు కార్యక్రమం. 20న అన్నదాత సుఖీభవ పథకం అమలు.. టెలికాన్ఫరెన్స్ లో స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు.
▪️611 కోట్లు అగ్రిగోల్డ్ ఆస్తులు బాధితులకు అప్పగించేందుకు అనుమతించిన నాంపల్లి కోర్టు.
▪️విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఆర్బిఐ ప్రాంతీయ కార్యాలయం ఈనెల 16న ప్రారంభించనున్న ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్ రవిశంకర్.
▪️స్త్రీ నిధి పథకంలో ఈ ఏడాది 5700 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడి.
▪️విమాన ప్రమాదం నేపథ్యంలో డీజీసీఏ కీలక నిర్ణయం. భారత్లోని అన్ని బోయింగ్ విమానాల తనిఖీకి ఆదేశం. అన్ని 787 సిరీస్ విమానాలపై ప్రత్యేక ఆడిట్.