
Sakshi Telugu News
June 12, 2025 at 02:44 PM
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ను వైఎస్సార్సీపీకి చెందిన పలువురు నేతలు కలిశారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పలువురు వైఎస్సార్సీపీ నేతలు.. గవర్నర్ నజీర్ను కలిసి పలు అంశాలపై వినతిపత్రం అందించారు. గవర్నర్ను కలిసిన వారిలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జగ్గయ్యపేట వైఎస్సార్సీపీ ఇంచార్స్ తన్నేరు నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు అరుణ్, రాహుల్, మేయర్ భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు శైలజా రెడ్డి, బెల్లం దుర్గలు ఉన్నారు.
https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/ntr-district-ysrcp-leaders-meet-governor-nazeer-2475801