
Ur's Sharif G Updates 🤝✅
June 5, 2025 at 05:14 PM
కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు.
- [ ] పింఛన్ల పెంపు.. నెలకు 64 లక్షల మందికి రూ.2720 కోట్లు పంపిణీ. ఏడాదిలో చేసిన ఖర్చు రూ. 34 వేల కోట్లు.
- [ ] 16,347 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి... మొదటి సంతకం హామీ నెరవేర్చిన ప్రభుత్వం
- [ ] దీపం-2 కింద 3 సిలిండర్లు ఉచితం. ఇప్పటికి కోటి సిలిండర్లు డెలివరీ. ఈ పథకం కోసం ఏడాదికి రూ.2684 కోట్లు ఖర్చు.
- [ ] గత ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు.
- [ ] అధికారంలోకి రాగానే రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమం. ఇప్పటికి రూ.1200 కోట్లు ఖర్చు చేసి 20 వేల కి.మీ రోడ్లు బాగు చేసిన ప్రభుత్వం
- [ ] మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే 217 జీవో రద్దు. మత్య్సకారుల సేవలో పథకం ద్వారా రూ.20 వేల ఆర్థిక సాయం కింద రూ. 259 కోట్లు ఇప్పటికే అందజేత.
- [ ] 203 అన్న క్యాంటీన్లు. మరో 61 అన్నా క్యాంటీన్ లు సిద్దం. 21 ప్రధాన దేవాలయాల్లో నిత్య అన్నదానం
- [ ] చెత్త పన్ను రద్దు. పేరుకుపోయిన 83 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త తొలిగింపు
- [ ] కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 55,57,525 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ.
- [ ] దీని కోసం 8,50,342 మంది రైతులకు రూ.13,584 కోట్లు చెల్లింపు. ధాన్యం రైతులకు గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.1674 కోట్లు కూడా అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో చెల్లించిన కూటమి.
- [ ] కూటమి ప్రభుత్వంలో రూ.990 కోట్లు పంచాయతీల్లో అభివృద్ది పనులకు కేటాయింపు.
- [ ] రూ.4500 కోట్లతో గ్రామాల్లో మళ్లీ వెలుగులు - 30 వేల పనులకు శ్రీకారం.
- [ ] రాష్ట్రానికి మళ్లీ పెట్టుబడులు. 78 ప్రాజెక్టుల ద్వారా రూ.9.20 లక్షల కోట్ల పెట్టుబడులు వీటితో 5.70 లక్షల ఉద్యోగాలకు అవకాశం.
- [ ] అనకాపల్లి జిల్లాలో రూ.1.85 లక్షల కోట్లతో ఎన్టిపిసి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు కు శంకుస్థాపన
- [ ] శ్రీ సిటీలో రూ. 5000 కోట్లతో ఎల్ జి ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ
- [ ] రూ. 65 వేల కోట్లతో రిలయన్స్ కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లు.
- [ ] అమరావతికి కేంద్రం ద్వారా రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం
- [ ] పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.12500 కోట్లు విడుదల
- [ ] స్టీల్ ప్లాంట్ కు రూ.11,400 కోట్లు కేంద్ర ప్యాకేజ్
- [ ] ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక వాడలకు కేంద్రం రూ.5 వేల కోట్లు కేటాయింపు
- [ ] విశాఖకు రైల్వే జోన్ మంజూరు. నిర్మాణ పనులు ప్రారంభం
- [ ] అనకాపల్లిలో రూ.1.35 లక్షల కోట్లతో అర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు అవగాహణ
- [ ] రామాయపట్నంలో రూ.96,862 కోట్లతో బిసిసిఎల్ రిఫైనరీ కి ఒప్పందం
- [ ] 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులకు శ్రీకారం...ఇప్పటికి 42 చోట్ల పనులు ప్రారంభం
- [ ] ఉచిత ఇసుక పాలసీ ద్వారా నిర్మాణ రంగానికి ఊతం
- [ ] రైతులకు మళ్లీ 90 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాల పంపిణీ పథకం ప్రారంభం
- [ ] పాడి రైతుల కోసం రూ. 2 లక్షల సబ్సిడీతో షెడ్లు నిర్మాణం
- [ ] కొత్త మద్యం విధానం ద్వారా జె బ్రాండ్లకు చెల్లు.. నాణ్యమైన మద్యం
- [ ] వాట్సప్ గవర్నెన్స్ మన మిత్ర ద్వారా 350 రకాల పౌర సేవలకు శ్రీకారం
- [ ] హంద్రీనీవా కాలువ విస్తరణ కు ఒకే ఏడాదిలో రూ. 3800 కోట్ల ఖర్చు
- [ ] 94 కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 73 పథకాలు పునరుద్ధరణ.
- [ ] మొన్నటి బడ్జెట్ లో బీసీల కోసం రూ.47,456 కోట్లు కేటాయింపు.
- [ ] దేవాలయాల్లో నాయి బ్రాహ్మణుల వేతనాలు రూ.25 వేలకు పెంపు
- [ ] చేనేతలకు జీఎస్టీ ఎత్తివేత. పవర్ లూమ్స్క 500 యూనిట్లు, హ్యాండ్ లూమ్స్ 200 యూనిట్లకు ఉచిత విద్యుత్
- [ ] గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపు
- [ ] స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు.
- [ ] సోలార్ విద్యుత్ పథకంలో బీసీలకు 3 కిలో వాట్లకు గాను మొత్తం రూ.98 వేలు సబ్సిడీ
- [ ] పిఎం సూర్యఘర్ కింద 20 లక్షల ఎస్సీ, ఎస్టీల ఇళ్లపై ఉచితంగా సోలార్ రూఫ్ టాప్
- [ ] వేద విద్యార్థులకు రూ.3 వేల భృతి, అర్చకుల జీతాలు రూ.15 వేలు, ఇమామ్లకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేలు, పాస్టర్లకు రూ.5 వేలు, జూనియర్ న్యాయవాదులకు రూ.10 వేలు చొప్పున గౌరవ వేతనాలు
- [ ] అధికారికంగా ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణదినం.
- [ ] అమరావతిలో 5 ఎకరాల్లో పొట్టిశ్రీరాములు విగ్రహం, స్మారకం నిర్మిస్తాం.
- [ ] టీచర్లకు మేలు చేసేలా 117 జీవో రద్దు చేశాం. యాప్ ల భారం తొలగింపు.
- [ ] పోలీసులకు రూ.213 కోట్ల సరెండర్ లీవ్ల సొమ్ము విడుదల.
- [ ] ఉద్యోగులకు ఏడాది కాలంలో రూ.7500 కోట్లు వివిధ మొత్తాల కింద విడుదల
- [ ] అంగన్వాడీలు, ఆశాలకు రూ.1.5 లక్షల మేర లబ్ది చేకూరేలా గ్రాట్యుటీ అమలు చేశాం.
- [ ] మహిళల రక్షణ కోసం శక్తి టీమ్స్ ఏర్పాటు. డ్రగ్స్, గంజాయి అరికట్టడానికి ఈగల్ విభాగం ఏర్పాటు
-- [ ] నవజాత శిశువుల కోసం 11 వస్తువులతో ఎన్టీఆర్ బేబీ కిట్లు
- [ ] లక్ష మంది మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ.
- [ ] రాష్ట్రంలో 5 చోట్ల రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లు
- [ ] విశాఖలో టిసిఎస్ తో ఒప్పందం. భూముల కేటాయింపు.
- [ ] అమరావతిలో క్వాంటం వ్యాలీకి భూముల కేటాయింపు.
- [ ] రూ.72 వేల కోట్ల హైవే ప్రాజెక్టులు...రూ.70 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టు పనుల్లో పురోగతి
- [ ] రూ.2245 కోట్లతో అమరావతికి 57 కి.మీ రైల్వే లైన్ మంజూరు.
- [ ] ఈ నెలలో తల్లికి వందనం, అన్నదాత పథకాలు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం.