Sangareddy District Police Updates
Sangareddy District Police Updates
June 15, 2025 at 01:38 PM
జిల్లా పోలీసు కార్యాలయం, సంగారెడ్డి జిల్లా. పత్రిక ప్రకటన తేది: 15-06-2025, *• జాతీయ మెగా లోక్-అదాలత్ లో భాగంగా సైబర్ క్రైమ్ రీఫండ్ నందు జిల్లాకు ఐదవ స్థానం.* *• జాతీయ మెగా లోక్-అదాలత్ లో 2287 కేసులలో రాజీ..* *• సైబర్ నేరగాళ్ల చేతిలో కోల్పోయిన 1.43 కోట్ల రూపాయలను తిరిగి సైబర్ బాధితులకు అందజేత..* *• జాతీయ మెగా లోక్-అదాలత్ ను విజయవంతం చేసిన అధికారులను, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ. పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు.* గత నెల రోజుల నుండి నిన్న తేది: 14.06.2025 వరకు జరిగిన జాతీయ మెగా లోక్-అదాలత్ లో భాగంగా, జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన, రాజీ పడటానికి అవకాశం ఉన్నటువంటి మరియు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న 502 - ఐ.పి.సి., 206 - సైబర్ క్రైమ్, ఇ-పెట్టి -300, డిడి కేసులు - 1279 మొత్తం = 2287 కేసులలో ఇరు వర్గాలను రాజీ కుదిరచడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. జాతీయ మెగా లోక్-అదాలత్ లో భాగంగా సైబర్ క్రైమ్ రీఫండ్ నందు రాష్ట్ర స్థాయిలో జిల్లాకు ఐదవ స్థానం, కమిషనరేట్లు మినహా జిల్లాతో పోలిస్తే సంగారెడ్డి జిల్లాకు మొదటి స్థానం రావడం జరిగిందన్నారు. జిల్లాను రాష్ట్ర స్థాయిలో అగ్రగామిగా ఉంచడంలో కృషి చేసిన అధికారులు, సైబర్ క్రైమ్ సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు అభినందించారు. క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్-అదాలత్ అనేది ఒక మంచి అవకాశం అని, అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని అన్నారు. రాజీ మార్గమే రాజా మార్గం అని, రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్ని కేసులల్లో ఇరు వర్గాలు రాజీపడవచ్చు అన్నారు. ముఖ్యంగా సైబర్ బాధితులకు సత్వర న్యాయం చేయాలని, TSCSB [తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో] డైరెక్టర్ శ్రీమతి. శిఖాగోయల్ ఐపిఎస్. గారి ఆద్వర్యంలో ప్రతి జిల్లాలో D4C ని ఏర్పాటు చేసి డియస్పి స్థాయి అధికారులచే పర్యాయవేక్షించడం జరుగుతుందన్నారు. సంగారెడ్డి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన సైబర్ నేరాలలో ఈ జాతీయ మెగా లోక్-అదాలత్ నందు 206 సైబర్ క్రైమ్ కేసులలో 1 కోటి, 43 లక్షల రూపాయలను తిరిగి సైబర్ బాధితులకు ఇప్పించేందుకు ఆర్డర్ కాపీలను సంబంధిత బ్యాంక్ నోడల్ అధికారులకు పంపించడం జరిగిందన్నారు. జిల్లా ప్రజలెవరైనా సైబర్ మోసాలకు గురి అయినట్లయితే వెంటనే 1930 కి కాల్ చేసి గాని, NCRP పోర్టల్ నందు లాగిన్ అయి దరఖాస్తు చేయవచ్చు అన్నారు. ఈ సందర్భంగా జాతీయ మెగా లోక్-అదాలత్ ను విజయవంతం చేసిన అధికారులు డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, D4C- ఇన్స్పెక్టర్ రవి, ఐటి ఇన్స్పెక్టర్ కిరణ్, ఎస్ఐ సత్యనారాయణ, అధికారులను, కోర్ట్ డ్యూటీ, సైబర్ సెల్ సిబ్బందిని ఎస్పీ గారు అభినందించారు.

Comments