Dev Tv
                                
                            
                            
                    
                                
                                
                                June 21, 2025 at 04:03 AM
                               
                            
                        
                            *ఫోన్ ట్యాపింగ్ కేసుపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు* 
హైదరాబాద్ జూన్ 21,2025: ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీజేపీ నేత బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్, సిరిసిల్ల నుంచి ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, దీనిని CBIకి అప్పగించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్రావు, రాధాకిషన్ వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయని అన్నారు. తన అరెస్ట్ కూడా ప్రభాకర్ ఆదేశాలతో జరిగిందని వెల్లడించారు. న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్కు నోటీసులు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. సిట్ ఎదుట వాంగ్మూలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news.
#telangana #telangananews #andhranews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #newsupdate #telugunews #newsreading #headlines #headlinestoday