Dev Tv
                                
                            
                            
                    
                                
                                
                                June 21, 2025 at 07:50 AM
                               
                            
                        
                            *జగన్ విమర్శలకు సీఎం చంద్రబాబు కౌంటర్* 
విశాఖపట్నం జూన్ 21,2025: యోగాంధ్రకు ప్రజాధనం వృథా అంటూ జగన్ చేసిన విమర్శలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. "రుషికొండ ప్యాలెస్కు వందల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసినవాళ్లే ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది" అని ఆయన ఎద్దేవా చేశారు.
"యోగాంధ్రకు కేంద్ర ప్రభుత్వం రూ.75 కోట్లు ఖర్చు చేసింది. ఇది రాష్ట్ర అభివృద్ధికి సూచికగా మారాల్సిన ఘట్టం. ఇలాంటి శుభ సందర్భంలో రాజకీయ విమర్శలు చేయడం తగదు" అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. "రాష్ట్రాన్ని కలుషితం చేయాలన్న ప్రయత్నాలను ఉపేక్షించమని, ఇటువంటి చర్యలపై కఠినంగా స్పందిస్తాం" అని హెచ్చరించారు.
Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news.
#telangana #telangananews #andhranews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #newsupdate #telugunews #newsreading #headlines #headlinestoday