
Keshaboina Sridhar BJP
729 subscribers
About Keshaboina Sridhar BJP
**"Welcome to the official channel of Keshaboina Sridhar, General Secretary, BJP OBC Morcha, Hyderabad Central, and President of Chetana Foundation. Stay informed on the latest initiatives, community welfare programs, and efforts towards the empowerment of the OBC community. Together, we strive for social progress, equality, and holistic development through impactful actions."**
Similar Channels
Swipe to see more
Posts

సరిగ్గా ఐదేళ్ళ క్రితం ఇదేరోజు పాకిస్తాన్లోని బాలాకోట్లో ఉన్న ఉగ్రవాద శిబిరాల మీద భారత సైన్యం దాడి చేసిన రోజు.

“నేను బ్రిటిషర్ల చేతికి ఎప్పటికీ చిక్కను!” • వీర విప్లవకారుడు చంద్రశేఖర్ ఆజాద్ అక్షరాలా నిజం చేసిన మాట ‘నీ పేరేంటి?’ ‘ఆజాద్..’ ‘తండ్రి పేరు?’ ‘స్వాతంత్ర్యం..’ ‘ఇళ్లెక్కడ?’ ‘జైలు..’ 15 ఏళ్ల బాలుడు చెప్పిన ఈ సమాధానాలు న్యాయమూర్తికి కోపం తెప్పించాయి. జైలుకు పంపలేక, 15 కొరడా దెబ్బల శిక్ష విధించాడు. ప్రతి దెబ్బకు “వందేమాతరం” నినాదం చేసి, తన చిత్తశుద్ధిని చాటుకున్నాడు ఆ బాలుడు. ఆ రోజు నుంచే భారత విప్లవ చరిత్రలో “చంద్రశేఖర్ ఆజాద్” అనే పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆజాద్ జననం & ఉద్యమ ప్రస్థానం 1906 జూలై 23న మధ్యప్రదేశ్లోని ఝబువా జిల్లా భాబ్రా గ్రామంలో జన్మించిన చంద్రశేఖర్ చిన్న వయసులోనే స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నాడు. భగత్సింగ్, సుఖ్దేవ్, రాజగురు వంటి వీరులతో కలిసి **హిందుస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్ (HRA)**లో కీలక సభ్యుడిగా పనిచేశాడు. 1925లో కాకోరి కుంభకోణం ద్వారా బ్రిటిష్ ఖజానా దోచుకొని విప్లవ ఉద్యమానికి నిధులు సమకూర్చారు. 1928లో లాలా లజపతిరాయ్ మరణానికి ప్రతీకారంగా లాహోర్లో బ్రిటిష్ ఎస్పీ సాండర్స్ను కాల్చి చంపాడు. చివరి శ్వాస వరకు ‘ఆజాద్’ 1931, ఫిబ్రవరి 27న అలహాబాద్లోని ఆల్ఫ్రెడ్ పార్క్లో భగత్సింగ్ను విడిపించేందుకు వ్యూహం రచిస్తున్న సమయంలో బ్రిటిష్ పోలీసులు చుట్టుముట్టారు. తీవ్రపోరాటం చేసిన ఆజాద్ చివరకు ఒకే ఒక్క బుల్లెట్ మిగిలింది. పోలీసుల చేతికి చిక్కడం ఇష్టం లేక తనను తాను కాల్చుకుని అమరుడయ్యాడు. భారత స్వాతంత్ర్య పోరాటంలో స్వేచ్ఛకు చిహ్నంగా నిలిచిన మహా వీరుడు చంద్రశేఖర్ ఆజాద్. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన త్యాగాన్ని స్మరించుకుందాం! వందేమాతరం! జై హింద్! #ChandrashekharAzad #AzadAmarRahe #VandeMataram #JaiHind #IndianFreedomStruggle #RevolutionaryHero #TributeToAzad #FreedomFighter #HindustanRepublicanAssociation #neverforget #IndianHistory #DeshBhakt #shaheedazad #InspirationalLeader #NationFirst


. కాంగ్రెస్ & BRS బాయి… బాయి . కాంగ్రెస్ పార్టీ & BRS పార్టీ తెహజీబ్ °°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°° . నిన్న తెలంగాణా రాష్ట్రంలో జరిగిన MLC ఎన్నికల్లో తెర వెనుక, BRS పార్టీ, కాంగ్రెస్ పార్టీతో “చేతులు” కలిపినట్టుగా గుసగుసలు. . బహుశా అందుకేనేమో, అందుకు ప్రతిఫలంగా ఈమధ్య “Telephone Tapping” కేసు దర్యాప్తు మందకోడిగా సాగుతుండడం… అలాగే ఆ కేసులోని నిందుతులందరికీ వరుసబెట్టి బేయిళ్లు రావడం గమనార్హం… . ఆ ఒప్పందంలో భాగంగానే, BRS పార్టీ ఈసారి MLC ఎన్నికల బరిలోకి దిగలేదు, లేకుంటే ఎన్నికలంటే ఎప్పుడూ “సై” అనే TRS/BRS పోటీ చేయకుండా వుండేది…!? So… ఎప్పటికైనా… . కాంగ్రెస్ పార్టీకి వేసే ఓటు BRS పార్టీకినే… . BRS పార్టీకి వేసే ఓటు కాంగ్రెస్ పార్టీకినే… ఎందుకంటే… ఆ రెండు పార్టీ “బొమ్మా - బొరుసు” లాంటివి… అందుకే… “కప్పగంతులు”: . కాంగ్రెస్ పార్టీ నుండి ఈ BRS పార్టీకి… . BRS పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి… — కేశబోయిన శ్రీధర్ General Secretary, Hyderabad Central BJP OBC Morcha


గోద్రా రైలు మారణకాండలో ప్రాణాలు కోల్పోయిన 59 మంది కరసేవకులకు నివాళులు. #గోద్రా@23years

విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపాలనుకుంటున్న కులకుటుంబ ప్రాంతీయ పార్టీలు °°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°° తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ వాలకం చూస్తావుంటే 2026 లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తన DMK పార్టీకి ఓటమి తప్పదేమోననే భయం ఆయన్ను పట్టుకున్నట్టుంది పాపం…!! అందుకే గత వారం రోజుల నుండి “New Education Policy” పేరిట ఒకవైపు హిందీ భాషపై విషం కక్కుతూనే… మరోవైపు 2026 తరువాత దేశం మొత్తం మీద లోకసభ మరియు అసెంబ్లీ స్థానాల్లో జరిగే “నియోజకవర్గాల పునర్విభజన” వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో లోకసభ స్థానాల సంఖ్య తగ్గుతుందంటూ మరో అబద్దపు విషప్రచారానికి ఇవ్వాళ్ల తెరలేపాడు. దీనికి ఇక్కడ తెలంగాణా నుండి KTR కూడా వంత పాడుతుండడం గమనార్హం. అయితే నిజానికి పెరిగిన జనాభాకు అనుగుణంగానే ఇప్పుడున్న స్థానాల సంఖ్య నిష్పత్తిలోనే “పునర్విభజన” జరుగనుంది తప్ప, ఏ ప్రాంతానికీ నష్టం జరిగే అవకాశం లేదు. దానితో దేశవ్యాప్తంగా లోకసభ మరియు అసెంబ్లీ స్థానాలు భారీగా పెరగనున్నాయి. ఉదాహరణకు మన తెలంగాణలో ఇప్పుడున్న 17 లోకసభ స్థానాలకు అదనంగా మరో 7 స్థానాలు రాబోతున్నాయి. అలాగే, 119 అసెంబ్లీ స్థానాలకు తోడు మరో 37 స్థానాలు రాబోతున్నాయి. అంటే, మొత్తం లోకసభ స్థానాలు 24కి పెరిగితే, అసెంబ్లీ స్థానాలు 146కి చేరుకునే అవకాశం ఉంది. వాటిని రౌండ్ ఫిగర్గా 150 చేయాలని పరిశీలించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని స్టాలిన్కు బాగా తెలుసు… KTRకూ బాగా తెలుసు… అయినా ఏదో ఒక పేరుతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలి, రాజకీయ లబ్ధి పొందాలి, కేంద్రంలో అధికారంలో ఉన్న BJPపై వ్యతిరేకత కలిగించాలి – ఇదే కుల, కుటుంబ ప్రాతిపదికన నడిచే ప్రాంతీయ పార్టీల చిల్లర రాజకీయ ఎత్తుగడ. ఈ కుటిల రాజకీయాలను ఖండిస్తూ, ఈరోజు తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూరు నగరంలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వీరి అబద్దపు ప్రచారాన్ని తీవ్రంగా విమర్శించారు. — కేశబోయిన శ్రీధర్ జనరల్ సెక్రటరీ, హైదరాబాద్ సెంట్రల్ BJP OBC మోర్చా


కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కేవలం మూడు మాత్రమే! ప్రస్తుతం దేశమొత్తం మీద కాంగ్రెస్ పార్టీ మూడే రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. అవి: 1️⃣ హిమాచల్ ప్రదేశ్ 2️⃣ కర్ణాటక 3️⃣ తెలంగాణ ఈ మూడు రాష్ట్రాల్లో కూడా అలవిమాలిన ఉచితాల హామీలు, అబద్ధపు ప్రలోభాలతో అధికారంలోకి వచ్చిందన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ ఉచితాలు అమలు చేయలేక పరిస్థితిని తట్టుకోలేని స్థితికి చేరింది. ➡️ హిమాచల్ ప్రదేశ్లో ఇప్పటికే 3-4 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దయనీయ పరిస్థితి. ➡️ కర్ణాటక, తెలంగాణాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అంతే దారుణంగా మారుతోంది. ➡️ BRS హయాంలో పెండింగ్లో ఉన్న పెన్షన్లు ఇప్పటికీ అందలేదు. ➡️ ఇచ్చిన హామీల్లో సగం కూడా అమలు చేయకుండా దగుల్బాజీ పాలన సాగిస్తోంది. ఉచితాల హామీల వల్ల ఖజానా ఖాళీ అవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటి ధరలు పెంచుతూ, అప్పులు చేస్తూ, చివరకు హిందూ ఆలయాల డబ్బులను దోచుకోవడానికి ప్రయత్నిస్తోంది. హిమాచల్ ప్రదేశ్లో ఇప్పటికే ఆ దిశగా కదలికలు ప్రారంభమయ్యాయి. కానీ BJP ఈ కుట్రను అడ్డుకున్నది. తెలంగాణలోనూ ఆలయాల నిధులపై కన్నేసే అవకాశం లేకపోలేదు! ➡️ BRS పార్టీకి హిందువుల పట్ల చిత్తశుద్ధి లేకపోవడంతో, వారు దీనిని అడ్డుకునే ప్రసక్తే లేదు. ➡️ అందుకే BJP ఈ విషయంలో అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం. రాబోయే ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అవ్వడం ఖాయం. ఇకపై జనాలు కాంగ్రెస్ పార్టీకి కూడా, దాని అబద్ధపు హామీలకూ నమ్మకం ఉంచే పరిస్థితి లేదు. ➡️ ఇంక రాదు… రాబోదు… రావద్దు! ➡️ ఈ మూడు రాష్ట్రాల్లో అధికారం కోల్పోతే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు నెత్తి మీద తడిగుడ్డ వేసుకొని అమ్మమ్మ వాళ్ల ఇటలీకి పారిపోవాల్సిందే! — కేశబోయిన శ్రీధర్ జనరల్ సెక్రటరీ, హైదరాబాద్ సెంట్రల్ BJP OBC మోర్చా #CongressFailed #NoMoreCongress #CorruptCongress #BJPForDevelopment #HindutvaUnderAttack #SaveHinduTemples #CongressLootsTemples #BJPForHindus #CongressFreeIndia #KarnatakaPolitics #TelanganaPolitics #HimachalPolitics #ModiFor2024 #RahulFailedAgain #PriyankaGandhiFail #BJPWillRise #indiawithbjp


భైంసా నుండి మొదలుకొని ముత్యాలమ్మ గుడి పై దాడులవరకు ఏనాడూ స్పందించని ktr ఇప్పుడు ఈ కొత్త డ్రామాలు ఎందుకంటారు ?