
JSPWestGodavari
965 subscribers
About JSPWestGodavari
Follow us to get fast & accurate updates of Janasena Party West Godavari District! Contact us through Email: [email protected]
Similar Channels
Swipe to see more
Posts

గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక్కో కుటుంబానికి 25 లక్షల రూపాయలు భీమా పథకం వర్తింపజేసేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.

నిడదవోలు నియోజకవర్గం, తీపర్రు కాలువగట్టు మీదుగా మార్టేరు నుండి ప్రక్కిలంక వెళ్లే రోడ్డు మరమత్తు పనులను పరిశీలిస్తున్న మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు.

పోలవరం శాసన సభ్యులు చిర్రి బాలరాజు గారిపై నిరాధారమైన అసత్య ప్రచారాలు చేస్తున్న ఓ ఆంగ్ల పత్రిక, ఎడిటర్ డి. ఎన్ మూర్తి నాయుడి పై పిర్యాదు చేసిన జనసేన నాయకులు శ్రీ. కరాటం సాయి మరియు గిరిజన నాయకులు బుచ్చి రాజు, చిర్రి రాంపండు.


ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పర్యాటక శాఖా మంత్రి వర్యులు శ్రీ గజేంద్రసింగ్ షేఖావత్ గారిని ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రిగారు అఖండ గోదావరి మరియు గండికోట ప్రాజెక్టులకు నిధులు కేటాయించినందున వారికి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే నూతన ప్రాజెక్టులకు ప్రతిపాదనలు సిద్ధం చేసుకుని వస్తే కొత్త ఆర్థిక సంవత్సరంలో మరిన్ని ప్రాజెక్టులకు ఆమోదం తెలిపేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రమంత్రి తెలియజేసారు.


సాధించిన విజయాన్ని సగర్వంగా చాటుదాం... రానున్న కాలానికి దిశానిర్దేశం చేసుకుందాం... జాతీయ రాజకీయాల్లో తిరుగులేని బావుటా ఎగురవేద్దాం... జనసేన పార్టీ అధినేత, గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన మార్చి 14 న పిఠాపురంలో ఘనంగా జరగనున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. #JanaSenaFormationDay


ప్రగతి పథంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి! గుంతల రోడ్లతో ఇబ్బందులు పడుతున్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల కష్టాలను తీర్చేలా, గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సదుపాయం మెరుగుపరిచే దిశగా గౌ|| ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ MGNREGS నిధుల ద్వారా, గౌ|| ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ధృఢ సంకల్పంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "పల్లె పండుగ" కార్యక్రమం ద్వారా, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో, గత 4 నెలల్లో 1,069 సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి, రూ.17.49 కోట్ల వ్యయంతో, 172.31 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు పూర్తి చేసిన కూటమి ప్రభుత్వం. #PallePanduga #AndhraPradesh


పల్లె పండుగ - ప్రగతికి అండగా ! ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో గ్రామాల్లో రోడ్లకు మహర్దశ #PawanKalyaAneNenu #IdiManchiPrabhutvam

పోలవరం నియోజకవర్గంలోని పలు సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వివరించి, నియోజకవర్గ అభివృధికి నిధులు మంజూరు చేయాలని కోరిన పోలవరం శాసన సభ్యులు శ్రీ చిర్రి బాలరాజు గారు.


ఢిల్లీలో జరుగనున్న సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్ అండ్ టూరిజం ఎగ్జిబిషన్-2025లో పాల్గొననున్న పర్యాటక మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ఉన్న వనరులు, అవకాశాలు వివరించి పెట్టుబడులు ఆహ్వానించునున్నారు.
