
Palla Srinivasa Rao | TDP
1.0K subscribers
About Palla Srinivasa Rao | TDP
State Party President, Telugu Desam Party | MLA Gajuwaka | MBA & M.Tech in Structural Engineering, Andhra University | @jai_tdp @naralokesh @ncbn.official
Similar Channels
Swipe to see more
Posts

తల్లికి వందనం పథకంపై ఉండవల్లి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించిన లోకేష్ బాబు.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే తల్లికి వందనం పథకానికి శ్రీకారం చుట్టాం. బాబు సూపర్ సిక్స్ లో ప్రధానమైన హామీ తల్లికి వందనం. ఈ తల్లికి వందనం ద్వారా 8,745 కోట్ల రూపాయలను 67,27,000 విద్యార్థుల తల్లుల అకౌంట్లలో జమచేయడం జరిగింది. అర్హులు ఎంతమంది ఉన్నా సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సోమవారం నుంచి అకౌంట్లలో నిధులు జమకానిపక్షంలో జూన్ 26 వరకు సమయం ఇస్తున్నాం. మనమిత్ర వాట్సాప్ ద్వారా లేక గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఫిర్యాదు చేయవచ్చని వివరించాను. #HappyMothersInAP #TallikiVandanam


ఈ నెల 21 తేదీన విశాఖలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా డేలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొననున్న నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఆర్కే బీచ్ వేదికగా ఐదు లక్షల మంది యోగాడేకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేసింది. ఆర్కే బీచ్ సహా వివిధ ప్రాంతాలలో చేసిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. యోగాంధ్ర 2025 నోడల్ అధికారి ఎం.టి. కృష్ణబాబు, విశాఖ జిల్లా కలెక్టర్ హరెంథిర ప్రసాద్ అరేంజ్ మెంట్స్ గురించి సీఎంకు వివరించారు. #Yogandhra #InternationalYogaDay #CBNinVizag #ChandrababuNaidu #AndhraPradesh


టీడీపీ జాతీయ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సోమవారం సాయత్రం విశాఖపట్నం సీతంపేటలోని మా స్వగ్రహం నందు మా తండ్రి గారైన పల్లా సింహాచలం గారి చిత్రపటానికి నివాళులు అర్పించి, మా కుటుంబ సభ్యులను పరామర్శించారు. నాన్న గారు విశాఖ-2 ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి చేసిన సేవలను గుర్తుచేసుకుని ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. ఇటువంటి సమయంలో పెద్దాయన(బాబుగారి) ఆత్మీయతతో కూడిన పరామర్శ మా కుటుంబ సభ్యులకు ఎంతో మనో ధైర్యాన్ని ఇచ్చింది. ఆయన అభిమానానికి ఎల్లప్పుడు కృతజ్ఞుడిని... #ChandrababuNaidu #PallaSrinivasaRao #TeluguDesamParty #Gajuwaka


చెరగని చిరునవ్వుతో ప్రజల హృదయ పలకలపై చెక్కిన సజీవశిల్పం మీ రూపం... ప్రేమ, దయాగుణం, ఆప్యాయతకి చిరునామా మీ హృదయం...మీరు వేసిన ప్రతి అడుగు మా అందరికి ఆదర్శం. నడిచిన ప్రతి దారి మార్గదర్శం. మీ కడవరకు మా అందరికి దారిచూపిన మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా భగవంతుడిని ప్రార్థిస్తూ... #PallaSrinivasaRao #TeluguDesamParty #TdpJspBjpTogether #Gajuwaka #Visakhapatnam

విశాఖలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు. ఈ నెల 20న భువనేశ్వర్ నుంచి విశాఖ చేరుకోనున్న ప్రధాని మోదీ. ఈ నెల 20న రాత్రి తూర్పు నౌకాదళ అతిథిగృహంలో బస చేయనున్న ప్రధాని. ఈ నెల 21న ఉదయం 6.30 నుంచి 7.45 వరకు విశాఖ బీచ్ లో యోగా డే. విశాఖ ఆర్కే బీచ్ లో జరిగే యోగా డేలో పాల్గొననున్న ప్రధాని మోదీ. ఈ నెల 21న మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ నుంచి ఢిల్లీ వెళ్లనున్న మోదీ.