
Bharatha Chaitanya Yuvajana Party | భారత చైతన్య యువజన పార్టీ | BCY Party
3.4K subscribers
Verified ChannelAbout Bharatha Chaitanya Yuvajana Party | భారత చైతన్య యువజన పార్టీ | BCY Party
Official Whatsapp Handle - Bharatha Chaitanya Yuvajana Party l భారత చైతన్య యువజన పార్టీ.
Similar Channels
Swipe to see more
Posts

మెగా డీఎస్సి కాదు.. దగా డీఎస్సి! * నార్మలైజేషన్ తొలగించి, జిల్లాకో పేపర్ ఇవ్వాలి.. * అయిదున్నర లక్షల అభ్యర్థులకు అన్యాయం.. * నిర్ణయం మార్చుకోకపోతే ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తాం.. * బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ప్రకటన.. మెగా డీఎస్సి పేరిట అయిదున్నర లక్షల మంది జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని.. ఒక ప్రక్రియ, ఒక విధానం, ఒక స్పష్టత లేకుండా.. అభ్యర్థులకు అన్యాయం జరిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ధ్వజమెత్తారు.. ప్రభుత్వం వెంటనే మేల్కొని.. అత్యున్నత స్థాయిలో నిర్ణయం సమీక్ష చేసి, అభ్యర్థులకు అనుకూలమైన నిర్ణయం తీసుకోకపోతే లక్షలాది మందితో ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.. ఈరోజు ఒక వీడియో సందేశం విడుదల చేసిన ఆయన ప్రభుత్వం ముందు కొన్ని స్పష్టమైన/ అభ్యర్థులకు న్యాయపరమైన డిమాండ్లు ఉంచారు.. * డీఎస్సి పరీక్షను 90 రోజులు వాయిదా వేయాలి.. అభ్యర్థులకు దరఖాస్తు చేసుకోడానికి వివిధ ధ్రువీకరణ పత్రాలు అందించి, అంతా సిద్ధమయ్యే సరికి పది రోజులు వృథా పోయింది.. ఇంత ఒత్తిడి మధ్య వాళ్ళు సరిగా రాయలేరు, కాబట్టి పరీక్షను 90 రోజులు వాయిదా వేయాలి.. * నార్మలైజేషన్ పద్ధతిని రద్దు చేసి, ఒక జిల్లాకు ఒకేసారి, ఒకే విధమైన పేపర్ (ప్రశ్నపత్రం)తో పరీక్ష నిర్వహించాలి.. * అభ్యర్థులకు వయో పరిమితి పెంచాలి.. తెలంగాణ రాష్ట్రంలో 47 ఏళ్ళు ఉంది.. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అదే వయసుని అర్హతగా నిర్ణయించాలి.. గడిచిన ఏడేళ్లుగా డీఎస్సి లేదు.. అంటే లక్షలాది మంది అభ్యర్థులు వయసు ధాటి, అనర్హులయ్యారు.. ప్రభుత్వం చేసిన తప్పులకు అభ్యర్థులు ఎందుకు బలవ్వాలి..? * రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థుల భవితను దృష్టిలో పెట్టుకుని.. ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలి.. రెండు ప్రభుత్వాల తప్పులకు, ఈ నిబంధనలకు నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంటే బీసీవై పార్టీ చూస్తూ ఊరుకోదు, అభ్యర్థులకు సానుకూలమైన నిర్ణయం తీసుకోకపోతే అభ్యర్థులతో కలిసి ముఖ్యమంత్రి గారి ఇంటిని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు..!!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో యువత పాత్ర కీలకం.. 40% ఓటర్లు ఉన్న యువత నిర్ణేతలుగా, నిర్మాతలుగా మారాల్సిన తరుణం వచ్చింది! "బీసీవై యువదళం.. యవనిక విప్లవం" రాజకీయాల్లో యువ నవ నాయకత్వ నిర్మాణమే లక్ష్యంగా బీసీవై పార్టీ నూతన విభాగం "బీసీవై యువదళం - నాయకత్వ సదస్సు.. శిక్షణ శిబిరం"..! రాజకీయ సంస్కరణతో సహా.. ప్రజా సమస్యలపై పోరాటానికి నిర్మాణాత్మక వ్యవస్థ రూపకల్పన.. వేదిక: The Venue, NTR Colony, NH 16 Service Road, Vijayawada తేదీ: మార్చి 6 (ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు) వివరాలకు: 9121258958 ను సంప్రదించగలరు.. #BCYYuvadalam #BCYPartyYuvadhalam #RCYYouthTeam #BharathaChaitanyaYuvajanaParty #RamaChandraYadav


మీ మరణం వృథా పోదు.. మీ త్యాగం ఈ నేల మరువదు.. ప్రతి రక్తపు బొట్టు దేశం కోసం ధారపోసిన వీర సైనికులను స్మరించుకుంటూ.. “ఈ దేశానికి మీరు.. మీకు ఈ దేశం” అమర ప్రేమికులుగా.. చిరకాలం మీ జ్ఞాపకాలతో..!! - మీ రామచంద్ర యాదవ్, అధ్యక్షులు, బీసీవై పార్టీ #RamaChandraYadav #PulwamaAttack #PulwamaAttack2019 #JoharIndianSoldier #BCYParty



Big Breaking News... పత్రికా ప్రకటన: Ramachandra Yadav, BCY Party Chief కేంద్ర హోమ్ మంత్రి శ్రీ అమిత్ షా గారిని కలిసిన రామచంద్ర యాదవ్.. * సావిత్రీభాయి పూలేకు భారతరత్న ఇవ్వాలని వినతి.. * ఆంధ్ర ప్రదేశ్ ప్రగతి, పాలన, రాజకీయ అంశాలపై చర్చ.. * అరగంట పాటు జరిగిన భేటీలో కీలక అంశాలపై చర్చ.. దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు.., మహిళల అభ్యున్నతికి కృషి చేసిన సావిత్రి భాయి పూలేకు ప్రతిష్టత్మాకమైన భారతరత్న అవార్డు ఇవ్వాలని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కోరారు.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని, గత ప్రభుత్వ అవినీతి కుంభకోణాలు, అక్రమ కేసుల వ్యవహారాన్ని వెలికి తీయాలని ఆయన కేంద్ర హోమ్ శాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారిని కోరారు.. ఢిల్లీలోని అమిత్ షా నివాసంలో ఆదివారం సాయంత్రం ఆయన కలిశారు.. దాదాపు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్ర రాజకీయ అంశాలు, గత ప్రభుత్వ నిర్వాకాలు, ప్రస్తుత సమస్యలు.. ఇలా అనేక అంశాలపై చర్చించారు.. సావిత్రీభాయి పూలేకు ఆ అవార్డు!! కలిసిన వెంటనే ముందుగా ఢిల్లీ ఎన్నికల గెలుపుపై శుభాకాంక్షలు చెప్పిన ఆర్సీవై.. “సావిత్రీభాయి పూలే గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని వినతి పత్రం అందించి.., ఆ అవసరాన్ని, ఆవశ్యకతను వివరించారు.. జనవరి 3 వ తేదీన జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని.. బీసీవై పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన వేడుకలు.. ఆ వేదికపై ఆర్సీవై మాట్లాడిన అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ వినతి పత్రం అందించారు.. అనంతరం రాష్ట్ర అంశాలపై మాట్లాడారు.., రాష్ట్ర పరిపాలన, ప్రగతి, ప్రధాన సమస్యలు సహా గత ప్రభుత్వం హయాంలో అనేక వర్గాలపై పెట్టిన అక్రమ కేసులను ఓ సారి విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు.. అలాగే రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం విరివిగా నిధులివ్వాలని కోరారు.. రాష్ట్రంలో ఇటీవల రాజకీయంగా అత్యంత కీలకంగా అడుగులు వేస్తున్న తరుణంలో బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ అమిత్ షాను కలవడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీసింది..!

బీసీవై హామీ ఫాలో అవుతున్న కూటమి! బీసీవై పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో “వారంలో అయిదు రోజులే బడి. ప్రతి శనివారం పిల్లలకు పూర్తిగా ఆటలు” అని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే! ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీన్ని ఆచరిస్తోంది.. “ప్రతి శనివారం నో బ్యాగ్ డే.. పిల్లలకు ఆటలు” అని మంత్రి లోకేష్ ప్రకటించారు!! బీసీవై అధినేత ఆశయాలు, ముందుచూపుకి ఇదే నిదర్శనం.. #BCYParty #BharathaChaitanyaYuvajanaParty #RamaChandraYadav

